ఇంట్లో చాలా మంది టిఫిన్ కూడా లెక్కలు పెట్టి చేస్తారు. ఎంతలా అంటే ఒక్కోటి వేసి లెక్కపెడుతూ దానిని ఇంకో ప్లేట్ లో వేస్తూ వీరికి ఇంత వారికీ ఇంత అంటూ ఇడ్లీ, దోశలు వేస్తారు. అయితే, ఇది మంచి పద్దతి కాదంటున్న వాస్తు నిపుణులు చెబుతున్నారు.
లెక్కపెడితే ఇంట్లోకి లక్ష్మి దేవి వెనక్కి రాకుండా వెళ్ళిపోతోంది. మన ప్రవర్తన చాలా ముఖ్యం. కాబట్టి, అలా చేయకండి. ఇదే అలవాటు వేరే ఇంటికి వెళ్లిన కూడా ఇలాగే అలవాటు అవుతుంది. మంచి ఫుడ్ ఉన్నచోట ఆత్మవిశ్వాసం ఉంటుంది.
మీరు చేసే పనులు ఇంటి పై కూడా ప్రభావం చూపుతుంది. మీరు ఏ పనినైనా లెక్కలు వేసుకుని చేయకండి. మీకు తెలియకుండానే ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. వాస్తు నిపుణులు ఇలా చేయొద్దని మరి మరి అంటున్నారు. ఒక వేళ చేస్తే మొత్తం దరిద్రమే.
మన సంపాదించే వాటిలో ఆహారం మాత్రమే తినగలం. కాబట్టి, వాటిని కూడా లెక్కలు వేసుకుంటూ తినకూడదు. మీరు చపాతీలను, దోశలను లెక్కపెట్టినప్పుడు ప్రతిదీ కొలిచి వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి, అలా అస్సలు చేయకండి. వంట చేసేటప్పుడు కూడా నిండు మనసుతో చేయాలనీ అంటున్నారు.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




