
టాలీవుడ్లో ప్రస్తుతం మిస్టికల్ మిస్టరీస్ ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ ఫైట్లు, డ్యూయెట్లతో సరిపెట్టుకున్న మన హీరోలు ఇప్పుడు రూట్ మార్చి సస్పెన్స్, అడ్వెంచర్తో కూడిన మిస్టికల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. పురాతన రహస్యాలను ఛేదించడానికి, కొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి స్టార్స్ అంతా సరికొత్త థ్రిల్లర్ బాట పట్టారు. మెగాస్టార్ చిరంజీవి నుండి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరకు అందరిదీ ఇదే దారి. విరూపాక్షతో సంచలనం సృష్టించిన కార్తీక్ దండు, నాగచైతన్యతో చేస్తున్న వృషకర్మ పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్గా రూపొందుతోంది. ఈ సినిమాలో చైతు అన్వేషకుడిగా కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా సుజిత్ సందీప్ల దర్శకత్వంలో మైండ్ బ్లాక్ చేసే మిస్టికల్ థ్రిల్లర్లో నటిస్తున్నారు, ఇందులో తేజ్ డీప్ మిస్టరీని ఛేదించే ఇంటెన్స్ ఫ్యాంటసీ రోల్లో సర్ప్రైజ్ చేయబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సైతం సోషియో-ఫ్యాంటసీకి మైథాలజీ టచ్ యాడ్ చేసిన భారీ మిస్టికల్ అడ్వెంచర్గా తెరకెక్కుతోంది.
మరిన్ని వీడియోల కోసం :