
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో మీనాక్షి హుడా, జైస్మిన్ లంబోరియా సెమీఫైనల్కు దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన 48 కేజీ క్వార్టర్ ఫైనల్ బౌట్లో మీనాక్షి 5–-0తో యుకా సదామట్సు (జపాన్)ను, 57 కేజీ బౌట్లో జైస్మిన్ 5–-0తో జియి చెన్(చైనా )ను చిత్తు చేశారు. మెన్స్ సెక్షన్లో లోకేష్ (85 కేజీ), ఆకాష్ (75 కేజీ), హర్ష్ చౌదరి (90 కేజీ) కూడా సెమీస్ చేరగా.. అంకుష్ (80 కేజీ) క్వార్టర్ ఫైనల్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.