
పాఫోస్ (సైప్రస్): ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో ఇండియా గ్రాండ్మాస్టర్ ఆర్.వైశాలి రెండో విజయం అందుకుంది. ఆదివారం జరిగిన విమెన్స్ సెక్షన్ ఏడో రౌండ్లో చైనాకు చెందిన టాన్ జోంగీపై గెలిచింది. దాంతో 4 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఓపెన్ సెక్షన్ ఆర్. ప్రజ్ఞానంద అమెరికా లెజెండ్ ఫాబియానో కరువానాతో తలపడి పోరాడి డ్రా చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రజ్ఞానంద 3.5 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.