Reading Time: 2 minutes
Vijayendra Prasad: ఆ పాట వినగానే కన్నీళ్లు ఆగలేదు.. రైటర్ విజయేంద్ర ప్రసాద్..

ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, తన కుమారుడు, స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి రూపొందించిన RRR సినిమాలోని జనని పాటతో తనకు ఎదురైన భావోద్వేగ అనుభవాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మొదటిసారి విన్నప్పుడు, తాను అదుపు చేసుకోలేనంతగా కంటతడి పెట్టుకున్నానని ఆయన పంచుకున్నారు. సినిమా మొత్తం పూర్తయిన తర్వాత రీ-రికార్డింగ్ కోసం కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారని, రాజమౌళి గదిలోంచి వినిపించిన ఈ పాట తనను అమితంగా కదిలించిందని ఆయన తెలిపారు. “ఆ పాట విన్నప్పుడు నేను షేమ్ లెస్ గా ఏడ్చేశాను. నాకు ఎందుకు అంత భావోద్వేగం కలిగిందో తెలియదు. బహుశా అది దేశభక్తి వల్లే జరిగిందని భావిస్తున్నాను,” అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు కూడా ఇదే విధమైన భావోద్వేగాన్ని అనుభవించారని చెప్పుకొచ్చారు. RRR సినిమాలో అజయ్ దేవగన్ రామ్ చరణ్ ను ఉత్తేజపరిచే ఒక కీలకమైన కామియో పాత్రను పోషించారని అన్నారు.

రచయితగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ, ఏ సినిమా రచయిత అయినా తనలో ఒక డైరెక్టర్ లేకుండా కథ రాయలేడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కథ రాసేటప్పుడు తాను చూసిన దృశ్యాన్ని కాగితంపై పెట్టడం తన పని అని, అయితే కంటి ముందు కనిపించిన దృశ్యాన్ని తెరకెక్కించడానికి అనేక విభాగాలతో, ముఖ్యంగా మానవ సంబంధాలతో వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. “అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాళ్ళతో పని చేయించుకోవాలి. అది పెద్ద కళ. ఆ విషయంలో నేను బలహీనుడిని,” అని ఆయన ఒప్పుకున్నారు. అయితే, రాజమౌళికి ఆ కళ బాగా తెలుసని, ఎవరినీ నొప్పించకుండా తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో అతను నిష్ణాతుడని ప్రశంసించారు.

రాజమౌళికి కథ చెప్పే స్వేచ్ఛ తనకు ఎప్పుడూ ఉంటుందని, అయితే తన నిర్ణయాలు తాను తీసుకోవడానికి రాజమౌళికి పూర్తి హక్కు ఉందని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. తండ్రిగా రాజమౌళి విజయాలను చూసి ఎంత గర్వపడుతున్నానో, తెలుగు వాడిగా తెలుగు సినిమా స్థాయిని రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు అంతే గర్వపడుతున్నానని ఆయన అన్నారు. తెలుగు భాషకు, తెలుగు సినిమాకు లభిస్తున్న గౌరవం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మహేష్ బాబుతో రాజమౌళి తదుపరి ప్రాజెక్ట్ ఒక పెద్ద సినిమా అవుతుందని కూడా ఆయన సూచించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..

జనని సాంగ్..



ఎక్కువ మంది చదివినవి :  Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..