చేపల పులుసుకు కావాల్సిన పదార్దాలు : కేజీ చేప ముక్కలు ( కొరమీను లేదా వంజరం), 100 గ్రాములు చింతపండు, రెండు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, మూడు టేబుల్ స్పూన్స్ కారం, రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.
చేపల పులుసు తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి దానిలో కొద్దిగా ఉప్పు, ఇంకా పసుపు, కొద్దిగా పట్టించి 20 నిమిషాల పాటు వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకుని దీనిలో ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.
పులుసు చక్కగా మరిగించాలి: మరిగించడం ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత దీనిలో కొద్దిగా చింతపండు రసం.. ఇంకా దీనిలో తగిన నీళ్లు పోయాలి. ఆ తరువాత దీనిలో కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఉప్పు కూడా కలిపి ఈ పులుసును బాగా మరగనివ్వాలి.
చేప ముక్కలు కూడా వేసుకోవాలి: పులుసు మరిగిన తర్వాత మ్యారినేషన్ చేసిన చేప ముక్కలను వేసి వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా చేస్తే పులుసు ముక్కలకు పట్టి మంచి రుచి వస్తుంది. ఇంకా దీనిలో అస్సలు గరిటె పెట్టకూడదు. గిన్నెను పొడి క్లాత్ తో పట్టుకుని రెండు మూడు సార్లు కదిలిస్తూ ఉండాలి.
ఆ తరవాత దీని మీద మూత పెట్టి సన్నని మంటపై 15 నుంచి 20 నిమిషాల పాటు పొయ్యి మీదే ఉంచి దీనిని బాగా ఉడికించాలి.
నూనె పైకి తేలినప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుని దీనిని కిందకు దించేయాలి. మీరు అన్నంలోకి తింటే పులస లాంటి ఉంటుంది. వేడి వేడిగా తింటేనే మంచి టేస్ట్




