Reading Time: < 1 minute

సెప్టెంబర్ 1 లోగా పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యమమే : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి

Caption of Image.

కామారెడ్డి, వెలుగు: పీఆర్సీ కాలపరిమితి ముగిసి మూడేండ్లు అయినా ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవటం శోచనీయమని టీచర్​ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్​రెడ్డి అన్నారు. పీఆర్టీయూ కామారెడ్డి జిల్లా సర్వసభ మీటింగ్​శనివారం ఓ ఫంక్షన్​హాల్​లో నిర్వహించారు. హాజరైన శ్రీపాల్​రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్1 లోపు 51 శాతం ఫిట్​మెంట్ పీఆర్సీ ప్రకటించాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

పీఆర్సీ టీచర్లకు భిక్ష కాదని, వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన హక్కు అని అన్నారు. ఈహెచ్ఎస్​ కార్డు పూర్తిస్థాయిలో అమయ్యేలా కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్​ దామోదర్ ​రెడ్డి, జనరల్​ సెక్రటరీ బిక్షంగౌడ్, అధికార ప్రతినిధి మహేందర్ ​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్​ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా ప్రెసిడెంట్​గా అల్లాపూర్ కుషాల్, జనరల్ సెక్రటరీగా పుట్ల శ్రీనివాస్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   

©️ VIL Media Pvt Ltd.