Reading Time: 2 minutes

రేషన్ కార్డు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన వార్త చెప్పబోతోంది. ముఖ్యంగా అంత్యోదయ అన్నయోజన (AAY) కార్డు ఉన్న కుటుంబాలకు రేషన్ పంపిణీలో పెద్ద మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇస్తున్న పద్ధతిని మార్చి, లబ్ధిదారులకు మరింత మేలు జరిగేలా కొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ కొత్త రూల్ ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుందో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం..

ప్రస్తుత విధానం ఏంటి?: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అంత్యోదయ రేషన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల స్థిరంగా ఒక కోటాను అమలు చేస్తోంది.ఇక ఈ స్కీమ్ కింద కార్డు ఉన్న ఒక కుటుంబానికి నెల మొత్తానికి కలిపి 35 కేజీల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనే దానితో సంబంధం లేకుండా ఈ 35 కేజీల బియ్యం అందుతోంది.

కొత్తగా రాబోతున్న మార్పు: అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పాత పద్ధతిలో మార్పులు చేయాలని యోచిస్తోంది. ఇకపై కుటుంబానికి ఫిక్స్‌డ్‌గా కాకుండా కార్డులో ఉన్న ఒక్కొక్క సభ్యుని లెక్కన రేషన్ ఇవ్వాలని చూస్తోంది. ఇక ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం అంత్యోదయ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ నెలకు 7 కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు.

Antyodaya Ration Update: New Rice Distribution Rules Explained
Antyodaya Ration Update: New Rice Distribution Rules Explained

పెద్ద కుటుంబాలకు బంపర్ ఆఫర్: ఈ కొత్త నిర్ణయం గనుక అమలులోకి వస్తే, ఎక్కువ మంది సభ్యులు ఉన్న పేద కుటుంబాలకు భారీగా లబ్ధి చేకూరుతుంది. ఇక ఉదాహరణకు ఒక అంత్యోదయ కార్డులో ఐదుగురు సభ్యులు ఉంటే.. కొత్త రూల్ ప్రకారం వారికి నెలకు ఏకంగా 35 కేజీల కంటే ఎక్కువ అంటే 35 కేజీల నుంచి 40 కేజీల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉంటుంది. సభ్యుల సంఖ్య పెరిగేకొద్దీ బియ్యం కోటా కూడా పెరుగుతుంది.

మిగతా కార్డుల పరిస్థితి ఏంటి?: ప్రస్తుతం అంత్యోదయ కార్డులు కాకుండా మిగతా సాధారణ రేషన్ కార్డులు ఉన్నవారికి వేరే నియమాలు ఉన్నాయి. ఇక వీరికి ప్రస్తుతం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. వీరికి ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుతానికి ఇదే కోటా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

అంత్యోదయ కార్డుదారులకు ఈ కొత్త విధానం ద్వారా మరింత పారదర్శకంగా, అవసరానికి తగినట్టుగా బియ్యం అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే పేద కుటుంబాల ఆకలి తీర్చడంలో ఇది మరో మంచి అడుగు అవుతుంది.

The post అంత్యోదయ కార్డులో మార్పులు.. ఇక ఒక్కొక్కరికి 7 కేజీల బియ్యం? appeared first on Manalokam – Latest Telugu News & Updates.