
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కొనసాగుతోంది హిట్లర్ పాలన కాదని.. పేదల పక్షపాతి ఇందిరమ్మ రాజ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. హిట్లర్ పాలన ఎవరిదో ప్రజలకు బాగా తెలుసని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ అబద్ధాల ప్రచారంలో ‘గోబెల్స్’ వారసుల్లా పోటీ పడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం 20 ఏండ్లు వెనక్కి వెళ్లిందన్నారు.