Reading Time: < 1 minute
Tension At School In Metpally As Students In Hanuman Deeksha Denied Entry

Metpally: జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న నిఖిల్ భారత్ స్కూల్ వద్ద హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. అందిన సమాచారం మేరకు.. హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులు దీక్షా వస్త్రాలు ధరించి పాఠశాలకు వచ్చారు. అయితే స్కూల్ యాజమాన్యం నియమ నిబంధనలను కారణంగా చూపిస్తూ వారికి పాఠశాలలోకి ప్రవేశం ఇవ్వలేదు. దీక్షా వస్త్రాలు ధరించి రావడం పాఠశాల నిబంధనలకు విరుద్ధమని యాజమాన్యం పేర్కొన్నట్లు తెలుస్తోంది.

Bollywood : భారత్ విభజన తర్వాత జ్ఞాపకాలు, ప్రేమ చుట్టూ తిరిగే భావోద్వేగ కథతో వస్తున్న స్టార్ డైరెక్టర్

విద్యార్థులను అడ్డుకోవడంపై హనుమాన్ దీక్షలో ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం చర్యలను నిరసిస్తూ స్కూల్ ముందు హనుమాన్ స్వాములు ధర్నాకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పరిసర ప్రాంతాల నుంచి కూడా హనుమాన్ దీక్షా స్వాములు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Vaibhav Suryavanshi: ఐపీఎల్‌లో ఆ దిగ్గజం రికార్డ్‌ను బద్ధలుకొడుతా.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు