July 11, 2026

కేటీఆర్ ఒక గులాబీ పిచ్చోడు.. యువతను రెచ్చగొడుతున్నాడు: ఎంపీ వంశీకృష్ణ ఫైర్

కేటీఆర్ ఒక గులాబీ పిచ్చోడు.. యువతను రెచ్చగొడుతున్నాడు:  ఎంపీ వంశీకృష్ణ ఫైర్
Reading Time: < 1 minute

కేటీఆర్ ఒక గులాబీ పిచ్చోడు.. యువతను రెచ్చగొడుతున్నాడు: ఎంపీ వంశీకృష్ణ ఫైర్

Caption of Image.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల తీరుపై పెద్దపల్లి ఎంపీ  గడ్డం వంశీకృష్ణ నిప్పులు చెరిగారు.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఓ గులాబీ పిచ్చోడు తిరుగుతున్నాడు.. అతడే కేటీఆర్’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసులు నమోదైతేనే లీడర్లు అవుతారంటూ యువతను కేటీఆర్ రెచ్చగొడుతున్నారని, కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుండాలనే స్వార్థం వారిదన్నారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నత చదువులు చదవాలి కానీ, మన పిల్లలు మాత్రం కేసులు, జైళ్ల చుట్టూ తిరగాలా? అని ప్రశ్నించారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన SIR కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, గ్రంధాలయ శాఖ రాష్ట్ర చైర్మన్ రియాజ్, DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణలతో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ మంత్రులు ఇథనాల్, కోల్ స్కామ్‌లకు పాల్పడుతూ దేశాన్ని కుంభకోణాల మయంగా మార్చారని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్న బీజేపీని ఓటు హక్కుతో ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

 దివంగత నేత వెంకటస్వామి (కాక) ఆశీస్సులు, ప్రజల దయతోనే తాను ఎంపీని అయ్యానని, పార్లమెంట్‌లో సింగరేణి కార్మికుల పెన్షన్ సమస్యలపై పోరాడుతున్నానని తెలిపారు. గత పదేళ్లుగా పట్టించుకోని కిషన్ రెడ్డి, ఇప్పుడు సింగరేణిని అభివృద్ధి చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. 

ALSO READ : నాకు పదవుల కంటే మాలల హక్కులే ముఖ్యం

బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి ప్లాన్‌ను మార్చి, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఆరోపించారు. కాక ఆశయమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా పూర్తి చేసి, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని వంశీకృష్ణ స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.