Reading Time: < 1 minute
Neet 2026 Paper Leak Shubham Khairnar Arrest Cbi Investigation

NEET Paper Leak: నీట్ 2026 ప్రశ్నా పత్రం లీక్ కావడంతో పరీక్షను రద్దు చేయడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న శుభం ఖైర్నార్ అనే నిందితుడిని మహారాష్ట్ర నాసిక్‌లో అరెస్ట్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (BAM) విద్యార్థి అయిన శుభం ఖైర్నార్‌ పేపర్ లీక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. శుభం ప్రశ్నాపత్రాన్ని రూ. 10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత హర్యానాకు చెందిన ఒక వ్యక్తికి రూ. 15 లక్షలకు అమ్మినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ లీక్ పేపర్‌ను అందుకున్న 150 మంది విద్యార్థులు, 70 మంది తల్లిదండ్రుల జాబితాను సీబీఐ అందుకుంది.

Read Also: Terrorist Digital Plan: భారత్ టార్గెట్‌గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!

ప్రస్తుతం కస్టడీలో ఉన్న 13 మంది ఎంబీబీఎస్ కౌన్సిలర్లను కూడా పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్ కౌన్సిలర్లు చెబుతున్నదాని ప్రకారం.. నీట్ గరిష్ట కట్ ఆఫ్ 600 పాయింట్లు, లీకైన పేపర్‌లో కూడా 600 పాయింట్లకు సమానమైన ప్రశ్నలు ఉన్నాయి. ఈ 600 మార్కులు వస్తే దేశంలోని టాప్ మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ పొందినట్లే. ఇదిలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్ అనే యువకుడిని సిట్ అదుపులోకి తీసుకుంది. రాజస్థాన్ ఏర్పాటు చేసిన సిట్ , గురుగ్రామ్ క్రైమ్ బ్రాంచ్ అధికారాలు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు.