వైశాఖ అమావాస్యను ప్రత్యేక రోజున రోజుగా భావిస్తారు. ఇక ఈ రోజే వైశాఖ అమావాస్య. అయితే, దీని వలన ప్రతికూల శక్తులు జీవితంలో ఎంటర్ అయ్యి కొందరికి అనేక సమస్యలను తెచ్చి పెట్టనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఈ అమావాస్య ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. అయితే, వాటిలో రెండు రాశుల వారికి కష్టాలు ఎక్కువయ్యేలా చెయ్యబోతున్నాయి. మరి అస్సలు లేట్ చేయకుండా ఆ దురదృష్ట రాశులు ఎవరు? వారు ఎలాంటి కష్టాలు ఎదుర్కొబోతున్నారో ఇక్కడ చూద్దాం..
ధనుస్సు రాశి వారు నిర్ణయం తీసుకునే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇతరుల వలన తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. ఇంకా ఉద్యోగంలో అనేక కొత్త సమస్యలు వస్తాయి. లక్ష్యాలు ఆలస్యంగా చేరుకుంటారు. ఓపికతో ఉండండి. అలా ఉంటే సమస్యలను తట్టుకోగలరు.
కుంభ రాశి వారికీ అనారోగ్య సమస్యలు ఎక్కువవనున్నాయి. ఇంకా మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది. ఇంకా ఇతరుల విషయాల్లో అస్సలు జ్యోక్యం చేసుకోకండి. ఉద్యోగం కూడా చాలా కష్టమే. కోపాన్ని తగ్గించుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




