Reading Time: < 1 minute
Sai Pallavi Ramayana Movie Losing Female Centric Projects Ms Subbulakshmi Biopic

రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నాచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కి ఎక్కట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది, కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదాగల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్ ప్రాజెక్ట్స్ చేజార్చుకుంది. సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ‘మా ఇంటి బంగారం’ కథ ఫస్ట్ తన దగ్గరికే వెళ్ళగా, కాల్ షీట్స్ ఖాళీ లేక నో చెప్పిందని సామ్ రీసెంట్లీ వెల్లడించింది. ఇక ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి కూడా నాచురల్ బ్యూటీ ఎప్పుడో తప్పుకుందని సమాచారం. బాలీవుడ్ లెజెండరీ ఆక్ట్రెస్ మధుబాల బయోపిక్ ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించిందట.

ప్రముఖ సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బలక్ష్మిని సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావాలని ఇటు గౌతమ్ తిన్ననూరి, అటు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ హీరోయిన్ సెట్ కావడం లేదు. సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చాక కీర్తి సురేష్ నుండి రుక్మిణి వసంత్ వరకు పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక పేరు వినిపిస్తోంది. రీసెంట్లీ ఆమె ఇంట్లో లుక్ టెస్ట్ చేశారని టాక్. అయితే రష్మికను ఫైనల్ చేశారా లేదా అన్నది ఇంకా సస్పెన్సే. అయితే నిజానికి సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిలిం ‘ఏక్ దిన్’ బెడిసికొట్టింది. ఆమె హోప్స్ అన్నీ రామాయణ పైనే. 4,000 కోట్లతో తెరకెక్కుతున్న రామాయణ హాలీవుడ్ రేంజ్ సినిమా అంటున్నా, ఆశించినంత మార్కెట్ జరగడం లేదు. హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 450 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్ర. అలాగే 700 కోట్ల రూపాయల డిజిటల్ రైట్స్ ఆఫర్ చేస్తే, 1000 క్రోర్ కావాలన్నాడన్నది టాక్. కానీ ఈ సినిమాకు ఇంత ఓవర్ హైప్ ఇస్తున్నా, కావాల్సినంత బజ్ క్రియేట్ కావడం లేదు. దీపావళికి పార్ట్ వన్ టార్గెట్ చేస్తున్న ఈ మైథాలజీ ఫిలిం, ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది.