Reading Time: 2 minutes
ATM Shutdown: దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

ATM Shutdown: చిన్న పట్టణాల్లో పెద్ద సంఖ్యలో ఏటీఎంలు మూతపడే ప్రమాదం ఉంది. ఈ ఆందోళనను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (క్యాట్మీ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) దృష్టికి తీసుకువచ్చింది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బిఐ, టైర్-1 నగరాల్లోని ఏటీఎంలకు అవసరానికి మించి నగదును పంపుతోందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల టైర్-2, టైర్-3 నగరాల్లో భారీ నగదు కొరత ఏర్పడి, పెద్ద సంఖ్యలో ఏటీఎంలు మూతపడే ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. బ్యాంకింగ్ రంగం నుంచి రూ.100 కోట్ల పరిహారాన్ని కూడా కోరింది.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా?

ఈటీ నివేదిక ప్రకారం, జూన్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్‌బిఐతో జరిగిన సమావేశంలో ఈ సమస్య ప్రధానంగా ఎస్‌బిఐ వల్లే తలెత్తిందని ఏటీఎం ఆపరేటర్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఏటీఎం నెట్‌వర్క్ ఈ బ్యాంకుకు ఉంది. దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు సుమారు 65,000 ఏటీఎంలు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌లో దాదాపు సగాన్ని బ్యాంకు స్వయంగా నిర్వహిస్తుంది. ఇందులో చాలా మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయి. అయితే చిన్న పట్టణాలు, గ్రామాల్లోని ఏటీఎంలలో నగదు కొరత ఉండటం వల్ల అక్కడి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఆదాయ నష్టం

ఈ సమస్య ముఖ్యంగా ఎస్‌బిఐకి ఆందోళన కలిగిస్తోందని ఏటిఎం కంపెనీ నామ్ సీఈఓ అన్నారు. చిన్న బ్యాంకులు నెట్టుకొస్తున్నాయి. కానీ ఎస్‌బిఐ ఇబ్బందులు మరింత పెరిగాయి. చాలా వరకు డబ్బు మెట్రో నగరాలకు వెళ్తుండటంతో ఇతర ప్రాంతాల్లో నగదు సరఫరా తగ్గిపోయిందని నామ్ సీఈఓ అన్నారు. ఈ రంగం రూ.100 కోట్లకు పైగా నష్టాలను చవిచూసిందని చెబుతున్నారు. యంత్రాలు పనిచేయనప్పుడు ఏటిఎం ఆపరేటర్లు లావాదేవీలు, ఇంటర్‌ఛేంజ్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోతారు.

ఇది కూడా చదవండి: Cheque Bounce: చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? చట్టం ఏం చెబుతోంది?

నష్టానికి బ్యాంకింగ్ రంగం నుంచి నష్టపరిహారం కోరినట్లు క్యాట్మీ తెలిపింది. జూన్ 20 లోగా ఎస్‌బిఐ ఈ సమస్యను పరిష్కరించకపోతే అనేక ఏటీఎంలను మూసివేయాల్సి రావచ్చని అది పేర్కొంది. ఏటీఎం ఆపరేటర్లు ఇప్పటికే చాలా తక్కువ లాభాలతో పనిచేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న వినియోగం తమపై ఒత్తిడిని మరింత పెంచాయని ఏటీఎం ఆపరేటర్లు చెబుతున్నారు.

ATM ఆపరేటర్లకు సమస్యలు

చిన్న పట్టణాల్లోని అనేక ఏటీఎంలు మూసివేత ప్రమాదంలో ఉన్నాయి. ఈ సమస్య ఎస్‌బిఐ బ్యాంకులో అత్యంత ప్రబలంగా ఉందని క్యాట్‌మి చెబుతోంది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు, టైర్-1 నగరాల్లోని ఏటీఎంలకు అదనపు నగదును పంపిస్తోంది.ఏటీఎంల నుండి డబ్బులు తీయడం తగ్గినప్పటికీ, నిర్వహణ ఖర్చులు పెరిగాయి.

నిర్వహణ ఖర్చులు

కనీస వేతనంలో 60% పెంపు, అధిక ఇంధన ధరల కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగాయని అంటున్నారు. అదే సమయంలో నెలవారీ ఏటీఎం విత్‌డ్రాయల్స్ జనవరి 2023లో 57 కోట్ల నుండి సెప్టెంబర్ 2025 నాటికి 4,39 కోట్లకి తగ్గాయి. దేశంలోని ఏటీఎంల సంఖ్య ఏడాది క్రితం 2,53,000 పైగా ఉండగా, 2024-25 నాటికి అది సుమారు 2,51,000కి పడిపోయింది. ఈ తగ్గుదలలో అధిక భాగం గ్రామాలు, పట్టణాల్లోనే సంభవించింది.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

ఇది కూడా చదవండి: Electric Car: కేవలం 3 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌.. 250 కి.మీ రేంజ్‌.. అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి