Reading Time: < 1 minute
Pune Divorce Case Viral Woman Earning %e2%82%b91 41 Lakh Gets %e2%82%b91 35 Lakh Monthly Maintenance

పెళ్లంటే నూరేళ్ల బంధం.. కానీ ప్రస్తుత రోజుల్లో వివాహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, లేదా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల్లోనే మనస్పర్ధలు, అభిప్రాయ బేధాలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఆర్థిక సమస్యలు, చివరకు అక్రమ సంబంధాలు వంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఓ జంట పెళ్లైన 6 నెలలకే డివోర్స్ తీసుకుంది.

అయితే కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే? నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు భరణం కింద భర్త నెలకు రూ.1.35 లక్షలు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇవ్వడమే. ఇద్దరు ఉద్యోగులైన దంపతులు వివాహం అయి 6 నెలల్లోనే విడాకులు తీసుకోవడం, కోర్టు ఆదేశం ప్రకారం భర్త నుంచి భార్యకు నెలకు రూ.1.35 లక్షలు మెయింటెనెన్స్ ఇవ్వాలని ఆదేశించడం వల్ల ఈ కేసు వైరల్ అయింది.

పూణేకు చెందిన దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వివాహం అయిన ఆరు నెలలకే ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు రావడంతో డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భర్త సంపాదన నెలకు రూ.2.79,499. భార్య జీతం నెలకు 1,41,436. భర్త, తన తల్లిదండ్రుల బాధ్యత కూడా చూసుకుంటున్నాడు. తాను భర్త నుంచి విడిపోయాక జీవనం సాగించడానికి సరిపడా జీతం పొందుతున్నప్పటికీ పెళ్లైన ఆరు నెలల్లో తాను కొనసాగించిన లైఫ్ స్టైల్ ని విడాకుల తర్వాత కూడా కొనసాగించే హక్కు తనకు ఉందని, తనకు భరణం కావాలని ఆమె కోర్టు ఎదుట వాదనలు వినిపించింది. పరిగణనలోకి తీసుకున్న కోర్టు, భర్తను తన జీతంలో సగం అంటే రూ.1.35 లక్షలను ఆమెకు భరణంగా చెల్లించాలని తీర్పిచ్చింది.

ఈ కేసు వైరల్ అయిన తర్వాత నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. “ఇద్దరు ఉద్యోగులైతే ఇంత భారీ మెయింటెనెన్స్ ఎందుకు?”, “అలిమనీ చట్టాలు లింగ నిష్పాక్షికంగా ఉండాలి” “పని చేసే మహిళలకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం ఫెయిర్ కాదు” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది అలిమనీ చట్టాలు, ఆర్థిక సమానత, ఆధునిక వివాహాలలో బాధ్యతలు అనే అంశాలపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది.