జూన్ 29 నుంచి నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో సంచరిస్తాడంట. ముఖ్యంగా నెల రోజుల పాటు బుధ గ్రహం తిరోగమనంలో ఉండటం వలన నాలుగు రాశులకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా కలిసి రానున్నదంట. పట్టింది బంగారమే కానున్నదంట.
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బుధ గ్రహం తిరోగమనం వలన పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. విదేశీ ప్రయాణం చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. చాలా ఆనందంగా జీవిస్తారు.
కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టింది బంగారం అవుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అన్ని విధాలుగా ఇది కలిసి వస్తుంది.
మిథున రాశి : మిథున రాశి వారికి బుధుడి తిరోగమనం వలన అప్పుల బాధలు తొలిగిపోతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు, వాటి నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు. సమాజంలో వీరికంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది
మేష రాశి : మేష రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతాయి. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా త్వరలో మంచి జాబ్ వస్తుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది




