
Jangaon: సాధారణంగా ఆస్తి కోసం తల్లిదండ్రులు కుమారులు చంపేసే ఘటనలు ఎన్నో చూసి ఉంటాం. కానీ.. ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆస్తి కోసం ఓ తండ్రి కన్న కొడుకులను లేపేయడానికి మాస్టార్ ప్లాన్ చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. కన్న కొడుకులకు బిస్కట్లో విషం ఇచ్చి చంపాలని సుపారీ ఇచ్చాడు తండ్రి. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టి గుబ్బడి తండాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. 2016 సంవత్సరంలో బానోతు శ్రీనివాస్ అనే వ్యక్తి అనితను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కుటుంబ కలహాల నేపథ్యంలో వేరే గ్రామానికి చెందిన మూడవత్ మమతను రెండోవ వివాహం చేసుకున్నాడు శ్రీనివాస్. కుమారుల పేరిట 20 గుంటల భూమి ఉంది. ఈ భూమిని ఎలాగైన కాజేయాలని ప్లాన్ చేశాడు. పిల్లలు తినే బిస్కట్లో విషం పెట్టి చంపాలని రెండవ భార్యతో కలిసి పన్నాగం పన్నాడు. ఈ సుపారీని అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తికి అప్పగించాడు కిరాతక తండ్రి. ఈ విషయం కాస్త బయటకు వచ్చింది. పిల్లలు భయంతో గ్రామంలో ప్రజలకు సమాచారం ఇవ్వడంతో ఈ తతంగం బయట పడింది. ఇక గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
READ MORE: TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో కొత్త కోణం.. ఇది కూడా ఉందా..?