
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి. తాజా అప్డేట్. రాజమౌళి తన పక్కా ముందస్తు ప్రణాళికతో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్ను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రధానమైన యాక్షన్ సీక్వెన్సెస్ మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే వారం నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపైన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రాజమౌళి విజువల్ వండర్గా రాబోతున్న ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ డ్రామా టోటల్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ముగియనుంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తయితే మిగిలిన సమయాన్ని పోస్ట్-ప్రొడక్షన్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులకు కేటాయించనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించినట్లుగానే ఈ విజువల్ స్పెక్టాకిల్ 7ఏప్రిల్ 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.