ముందుగా బాజ్రా పిండి అనగా సజ్జ పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొద్దిగా నీళ్ళు పోసి వాటిని బాగా మరిగించాలి. నీళ్లు కొద్దిగా తర్వాత బాజ్రా పిండి కలపాలి.
ఈ సమయంలో ఉండలు ఉండలుగా లేకుండా చేసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇది కొంతసేపటికి గట్టిగా అవుతుంది. ఇప్పుడు మీడియం మంట మీద బాగా ఉడికనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి కరిగే వరకు ఉంచుకోవాలి.
ఇక్కడే ఇంకో కొత్త సూపర్ ట్విస్ట్ ఉంటుంది. కొద్దిగా మజ్జిగ లేదా పెరుగు వేసి మిక్స్ వేస్తే ఈ టెస్ట్ కి మంచి రుచి వస్తుంది. చివర్లో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
కొంతసేపు మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే ఇది గట్టిగా మారుతుంది. అంతే కాదు , దీనిలో మజ్జిగ పోస్తే ఇది చిక్కగా ఉంటుంది. ఇంకా వేడిగా తాగినా బాగుంటుంది, చల్లగా తాగినా కూడా మంచిగా ఉంటుంది.
రాజస్థాన్ చుట్టుపక్కల గ్రామాల్లో ఎండల్లో పొలం పని చేసే వాళ్లు దీనిని రోజుకొక గ్లాస్ తాగేవాళ్ళు. ఇది శరీరానికి చల్లదనం, ఎనర్జీ ని కూడా ఇస్తుంది.




