Reading Time: 2 minutes
Thailand Songkran Festival Deaths 191 Road Accidents

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నూతన సంవత్సర వేడుకలను విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. అందులో థాయ్‌లాండ్ జరుపుకునే ‘సాంగ్‌క్రాన్’ పండుగ అత్యంత ప్రత్యేకమైనది. వేలాది గ్యాలన్ల నీటిని రోడ్లపై ఒకరిపై ఒకరు చల్లుకుంటూ, కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ వేడుకలు చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఆయుర్వేద మూలికలు కలిపిన నీటితో స్నానాలు చేయడం, బుద్ధుడి విగ్రహాలను శుభ్రపరచడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ పండుగలో అంతర్భాగం. అయితే, ఈ ఏడాది ఆ దేశంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆనందంగా మొదలైన నీటి యుద్ధాలు రక్తం చిందించే ప్రమాదాలుగా మారాయి. వందలాది మంది మరణవార్తలతో సాంగ్‌క్రాన్ వేడుకలు విషాద చాయల మధ్య ముగిశాయి. అసలు ఈ పండుగ నేపథ్యం ఏమిటి? అంతమంది ప్రాణాలు కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేవి ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి.

GT vs KKR: బ్యాటు ఝుళిపించిన కామెరూన్ గ్రీన్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

థాయ్‌లాండ్ సంస్కృతిలో సాంగ్‌క్రాన్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ అంటే నీటి పండుగ. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకోవడం ద్వారా గతంలోని పాపాలు, కష్టాలు కడిగివేయబడతాయని, కొత్త జీవితం పవిత్రంగా ప్రారంభమవుతుందని అక్కడి ప్రజల నమ్మకం. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఈ వేడుకల కోసం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది థాయ్‌లాండ్‌కు తరలివస్తుంటారు. కానీ, ఈ ఏడాది ఈ ఉత్సాహం పెను విషాదంగా మారింది. పండుగ సందర్భంగా నిర్వహించిన ‘సెవెన్ డెడ్లీ డేస్’ (ఏడు ప్రమాదకర రోజులు) పర్యవేక్షణ కాలంలో ఇప్పటివరకు 191 మంది ప్రాణాలు కోల్పోయారు.

Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!

వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన వేగం కారణంగా వందలాది రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక్క వాహన ప్రమాదాలే కాకుండా, వివిధ హింసాత్మక ఘటనలు కూడా మరణాల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి. థాయ్ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, వేలాది మంది గాయపడి ఆసుపత్రుల పాలయ్యారు. నీటితో ఆడుకునే క్రమంలో రోడ్లపై వాహనదారుల నియంత్రణ తప్పడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. ఒక పక్క నూతన సంవత్సర శుభాకాంక్షలతో దేశం కళకళలాడాల్సి ఉండగా, మరోపక్క భారీ మరణాలు సంభవించడంతో సాంగ్‌క్రాన్ పండుగ ప్రాముఖ్యత కంటే ఇప్పుడు అక్కడ జరిగిన ప్రాణనష్టమే అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అధికారులు భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజల అజాగ్రత్త , మితిమీరిన ఉత్సాహం ఈ స్థాయి విషాదానికి దారితీసింది.