కావాల్సిన పదార్ధాలు : పచ్చి కొబ్బరి ముక్కలు, రెండు కప్పుల పాలు, బియ్యం, సేమియా , పావుకిలో బెల్లం, 5 జీడిపప్పులు, 5 బాదం పప్పులు, 5 కిస్ మిస్ లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో నెయ్యి వేసి కొబ్బరిని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. అలాగే, బెల్లాన్ని కూడా తీసుకోవాలి .
ఇప్పుడు వేరే పాన్ తీసుకుని గ్యాస్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టి వేయించిన కొబ్బరి పొడిని వేసి ఆ తర్వాత పాలు, బెల్లం తురుమును వేసి కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి
పాలు, బెల్లం బాగా మరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా 15 నిమిషాల పాటు వాటిని అలాగే ఉడికించాలి. ఈ మిశ్రమం పాయసంలా అయ్యేవరకు వాటిని బాగా వేయించాలి.
కొబ్బరి పాయసాన్ని పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది రుచికరంగా ఉంటుంది. ఆ తర్వాత వీటిలో రెండు టీ స్పూన్స్ నెయ్యి, కిస్ మిస్ లు, జీడీపప్పులు, బాదం పప్పులు వేసి గరిటేతో వీటిని కలపాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ.




