
శుక్రవారం పార్లమెంట్లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్లో బిల్లు ఎలా ఆమోదం పొందుతుందని ఆనేదిఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.