Reading Time: < 1 minute

నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న టూరిస్టు బస్సు బోల్తా.. 8 మందిగి తీవ్ర గాయాలు

Caption of Image.

నిజామాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 35 మంది టూరిస్టులతో హైదరాబాద్  వస్తున్న బస్సు వర్ని మండలం బడాపహాడ్ శివారు లో బోల్తా పడింది. పటాన్ చెరుకు చెందిన యాత్రికులు ప్రైవేట్ స్కూల్ బస్సులో  వస్తుండగా శుక్రవారం (ఏప్రిల్ 03) జరిగింది ఈ ఘటన.

బడా పహాడ్ అటవీ ప్రాంతంలో మూల మలుపు వద్ద బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడినట్లు ప్రయాణికులు తెలిపారు. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.