Reading Time: < 1 minute
Ayatollah Khamenei Funeral Delayed Iran Reason July 2026

Ayatollah Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, యుద్ధం అసాధారణ పరిస్థితుల వల్ల అంత్యక్రియలు ఆలస్యమైనట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.

ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ.?

ఖమేనీని రహస్యంగా ఖననం చేశారని పలు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రచురించినప్పటికీ, అవన్నీ నిజాలు కావని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇస్లామిక్ పద్ధతుల్ని, సంప్రదాయాలను పాటిస్తూ, కెమికల్ ఎంబాల్మింగ్ చేయకుండా ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్‌లో అలీ ఖమేనీ మృతదేహాన్ని భద్రపరిచినట్లు ఇరాన్ తెలిపింది. షియా మత సంప్రదాయాల్లో అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియల ఆలస్యానికి అనుమతి ఉంటుందని మత నిపుణులు చెబుతున్నారు.

అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు:

ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని టెహ్రాన్‌లో అంత్యక్రియలు ప్రారంభమై, పలు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీని తర్వాత, ఇరాన్‌లోని నజఫ్, కర్బలా పవిత్ర నగరాలకు ఖమేనీ మృతదేహాన్ని తీసుకెళ్తారు. చివరగా ఆయన స్వస్థలమైన మషాద్‌లో ఇమామ్ రిజా దర్గా వద్ద జూలై 9న ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ఇరాన్ ప్రజలు హాజపరవుతారని అంచనా. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇరాన్ పలు దేశాలధినేతలకు ఆహ్వానాలు అందించింది. భారత ప్రధాని నరేంద్రమోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపారు. భారత్, పాక్, చైనా సహా పలు దేశాలు తమ ప్రతినిధుల్ని పంపనున్నట్లు ప్రకటించాయి.