
బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. వరుసగా రెండో రోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పెరిగాయి. ఇలా అయితే కొనేదెట్టా అంటూ పసిడి ప్రియులు పెదవి విరుస్తున్నారు. నేడు తులం బంగారం ధర రూ. 3220 పెరిగింది. సిల్వర్ ధర రూ. 10000 పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం (99.9% స్వచ్ఛత) గ్రాముకు రూ.14,700, 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత) గ్రాముకు రూ.13,475, 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత) గ్రాముకు రూ.11,025 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3220 పెరిగి రూ. 1,47,000 వద్ద సేల్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2950 పెరిగి రూ.1,34,750 కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,150 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,34,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ లో కిలో సిల్వర్ ధర రూ. 2,60,000కి చేరింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 5000 పెరిగి రూ. 2,50,000 వద్ద సేల్ అవుతోంది.