
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్ దాదాపు రూ.10,800 కోట్ల (1.14 బిలియన్ డాలర్ల) భారీ డీల్ను దక్కించుకుంది. దీంతో కంపెనీ షేర్లు శుక్రవారం 4.36 శాతం పెరిగి రూ. 1,125.10 స్థాయికి చేరాయి.
యూరప్కు చెందిన ఒక ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీ నుంచి ఈ డీల్ పొందామని హెచ్సీఎల్ ప్రకటించింది. ఈ క్లయింట్ కోసం ఏఐ ఆధారిత ఆపరేటింగ్ మోడల్ను రూపొందించనుంది. అయితే, క్లయింట్ పేరును వెల్లడించలేదు.