Reading Time: < 1 minute

దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,000 తగ్గి రూ.1.60 లక్షలకు చేరుకుంది. గత రెండు రోజుల్లో బంగారం ధర మొత్తం రూ.7,000 తగ్గింది. ఒక కిలో వెండి ధర కూడా రూ.13,000 తగ్గి రూ.2.58 లక్షలకు పడిపోయింది. రెండు రోజుల్లో వెండి ధర మొత్తం రూ.32,000 తగ్గింది. లాభాల బుకింగ్ కారణంగా ఈ తగ్గుదల వచ్చిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధర సుమారు రూ.26,000, వెండి ధర రూ.27,000 పెరిగాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగితే లేదా ముడి చమురు ధరలు పెరిగితే బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణుల పేర్కొంటున్నారు.