Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌లో టీం ఇండియా మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అమీ-తుమీ తేల్చుకోనుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో టి-20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అభిషేక్‌పై విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఇషాన్ కిషన్ ఏడు మ్యాచుల్లో 224 పరుగులు సాధించాడు. ఇక సంజూ శాంసన్ తాన్ ఆడిన మూడు మ్యాచుల్లో 143 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా వెస్టిండీస్‌పై 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇషాన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని.. అలాగే రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని శాస్త్రి అన్నారు. ‘‘ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అభిషేక్ శర్మను ఆడించాలి. మానసికంగా ఇబ్బంది పడుతుండటం వల్లే అతడు స్కోర్ చేయలేకపోతున్నాడు. గతంలో ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇషాన్ కిషన్‌ను అతడితో ఓపెనింగ్ చేయించాలి. అంతేకాక.. తుది జట్టులో రింకూ సింగ్‌కి అవకాశం కల్పించాలి. లోయర్ ఆర్డర్‌లో అతడిని బ్యాటింగ్ చేయించాలి’’ అని శాస్త్రి పేర్కొన్నారు.