
టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే సాయి పల్లవి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుండి తప్పుకుందని ఆ అవకాశం కోలీవుడ్ బ్యూటీ రుక్మిణి వసంత్కు దక్కిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అవేవి వాస్తవం కాదని మేకర్స్ తెలిపారు.
నిర్మాత బన్నీవాసు ద్వారా అందిన సమాచారం ప్రకారం ఎం.ఎస్. సుబ్బలక్ష్మి పాత్రకు సాయి పల్లవి తప్ప మరో ఆలోచన లేదు. ఆమెను మార్చామనే వార్తలన్నీ కేవలం ఫేక్ న్యూస్ మాత్రమే. ఈ పాత్రకు ఆమె వంద శాతం న్యాయం చేయగలదని టీమ్ బలంగా నమ్ముతోంది. రుక్మిణి వసంత్ను తీసుకున్నామనే దాంట్లో అస్సలు నిజం లేదు’ అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 2026 నుండి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని బన్నీ వాస్ వెల్లడించారు. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న ఈ క్లాసికల్ బయోపిక్కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించబోతున్నారు. ఈ పాత్ర కోసం సాయి పల్లవి ఇప్పటికే కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. రామాయణ, కల్కి 2, మణిరత్నం ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటంతో షూటింగ్ అక్టోబర్ కి వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్స్, అనిరుధ్ సంగీతం మరియు సాయి పల్లవి అద్భుత నటన తోడైతే ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.