Reading Time: 2 minutes
Oasis Janani Yatra Reaches Tirupati Free Fertility Awareness And Screening Services Across India

Oasis Janani Yatra: సంతానోత్పత్తి వైద్య రంగంలో భారతదేశంలో నమ్మకమైన సంస్థగా పేరుపొందిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, గత 5 నెలలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తన యాత్రను విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమమైన ‘ఓయాసిస్ జనని యాత్ర’ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చేరుకుంది.

ఈ చొరవ ద్వారా టైర్ 2, 3 నగరాల్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం ఇంకా ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను వారి ప్రాంతాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఓయాసిస్ ఫెర్టిలిటీ పనిచేస్తోంది. దీని ద్వారా సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, దంపతులకు అవసరమైన వైద్య సలహాలను అందిస్తోంది.

జీవనశైలి మార్పులు, ఆలస్యంగా సంతానం కోసం ప్రయత్నించడం, శాస్త్రీయ అవగాహన లోపం వంటి కారణాలతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓయాసిస్ జనని యాత్ర బస్సు ద్వారా ఉచిత సంతానోత్పత్తి సంప్రదింపులు, ఉచిత AMH మరియు హిమోగ్లోబిన్ పరీక్షలు, అలాగే ఉచిత వీర్య విశ్లేషణ (Semen Analysis) సేవలు అందిస్తున్నారు.

సురక్షితమైన, పరిశుభ్రమైన నమూనా సేకరణ సౌకర్యాల ద్వారా దంపతులకు ప్రాథమిక దశలోనే కచ్చితమైన, సానుభూతితో కూడిన మార్గదర్శకత్వాన్ని ఈ యాత్ర అందిస్తోంది. తిరుపతి నుంచి ఈ యాత్ర రాబోయే రోజుల్లో కదిరి మరియు ఇతర ప్రాంతాలకు విస్తరించనుంది. దీని ద్వారా మరిన్ని ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన మరియు ప్రాథమిక స్క్రీనింగ్ సేవలను అందించి వారికి భరోసా కల్పించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డా. శ్రీహరి తోపాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అవసరమైన సంతానోత్పత్తి ఆరోగ్య విద్యను కుటుంబాలకు మరింత దగ్గర చేయడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ చేస్తున్న కృషిని వారు అభినందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ డా. శ్రీహరి మాట్లాడుతూ.. “8 రాష్ట్రాల్లో దేశవ్యాప్త పర్యటనను పూర్తి చేసుకుని ఓయాసిస్ జనని యాత్ర తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుతున్న సమయంలో అవగాహన కల్పించడం మరియు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరం. శాస్త్రీయ దృక్పథంతో ప్రజల వద్దకు చేరుతున్న ఈ యాత్ర కుటుంబాలకు సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రేరణనిస్తోంది” అని తెలిపారు.

ఓయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్ మరియు కో-ఫౌండర్ డా. దుర్గా జి. రావు మాట్లాడుతూ, “సంతానోత్పత్తి శాస్త్రం నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో, ఓయాసిస్ జనని యాత్ర ఆధునిక మరియు సాక్ష్యాధారిత వైద్య సమాచారాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు చేరుస్తోంది. ప్రాథమిక దశలోనే సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా దంపతులు తల్లిదండ్రులుగా మారే ప్రయాణాన్ని సులభతరం చేయగలుగుతున్నాం” అని తెలిపారు.

ఓయాసిస్ ఫెర్టిలిటీ సీఈఓ పుష్కరాజ్ షెనాయ్ మాట్లాడుతూ, “భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉండే, సకాలంలో లభించే వైద్య సేవలు ఎంతో ముఖ్యమైనవి. ఈ యాత్ర ద్వారా నిపుణుల కౌన్సెలింగ్, ప్రాథమిక పరీక్షలు మరియు క్షేత్రస్థాయిలో మద్దతు అందిస్తున్నాం” అని తెలిపారు. ఓయాసిస్ ఫెర్టిలిటీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా. పల్లవి తపాల మాట్లాడుతూ, “ఈ యాత్రకు లభిస్తున్న స్పందన అద్భుతంగా ఉంది. సంతానోత్పత్తి సమస్యలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న దంపతులకు సరైన సమాచారం మరియు సానుభూతితో కూడిన మద్దతును అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

ఓయాసిస్ ఫెర్టిలిటీ:
2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశవ్యాప్తంగా 35కు పైగా కేంద్రాలతో ప్రముఖ సంతానోత్పత్తి ఆరోగ్య సేవల సంస్థగా నిలిచింది. అధునాతన ల్యాబ్ సదుపాయాలు, అధిక ఐవిఎఫ్ విజయ శాతం, వ్యక్తిగత సంరక్షణతో ఐవిఎఫ్, ఐయుఐ, ఐసిఎస్ఐ, ఐవిఎం, పిజిటి-ఏ వంటి విస్తృత సేవలను అందిస్తోంది.