Reading Time: < 1 minute
Rahul Gandhis Wife Remark Sparks Laughter In Lok Sabha During Womens Reservation Bill Debate

Rahul Gandhi: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై రాహుల్ గాంధీ శుక్రవారం లోక్‌సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ నేత ప్రసంగం సమయంలో ఆయన చమత్కారాలతో సభ ఒక్కసారిగా నవ్వింది. ప్రతీ ఒక్కరి జీవితంలో తల్లి, సోదరి, భార్య రూపంలో మహిళలు ప్రభావం ఎంతో ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. మనం మహిళను ఒక శక్తిగా, ఒక జీవితాన్ని నడిపించే శక్తిగా చూస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరు కూడా తల్లి, సోదరి, భార్య ద్వారా ఎంతో ప్రభావితమవుతారని అన్నారు.

Read Also: RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్‌కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..

అయితే, రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేస్తూనే.. నాకు, ప్రధాని నరేంద్రమోడీకి ‘‘భార్యల సమస్య’’ లేదని అనడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు విరబూశాయి. తన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకగాంధీ గురువారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేసిన ప్రసంగాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తన సోదరి చేసిన ప్రసంగం అద్భుతమని కొనియాడారు. ‘‘నిన్న, మా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బహుశా నేను చేయలని పనిని నా సోదరి 5 నిమిషాల్లో సాధించడం చూశాను. అదేటంటే ఆమె అమిత్ షాను నవ్వించింది’’ అని అన్నారు.

గురువారం ప్రియాంకాగాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు ఇదిలా ఉంటే, చాణక్యుడిని ప్రస్తావిస్తూ ఆమె వేసిన సెటైర్లు సభలో నవ్వులు పూయించాయి. కేంద్రం హోం మంత్రి అమిత్ షా కూడా ప్రియాంకా వ్యాఖ్యలకు నవ్వారు. ‘‘మీరంతా పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఈ రోజు గనుక చాణక్యుడు బతికి ఉంటే మీ కుయుక్తికి ఆయన ఆశ్చర్యపోయి ఉండేవారు.’’ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలుకే అమిత్ షాతో పాటు మంత్రులు కిరెన్ రిజిజు నవ్వారు.