Reading Time: < 1 minute
Rayavaram Bus Tragedy Ap Government Declares Rs 5 Lakh Ex Gratia For Families

Rayavaram Bus Tragedy: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై విస్తృతంగా చర్చించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేబినెట్ సభ్యులు సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also: Pat Cummins-SRH: ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులకు శుభవార్త.. పాట్‌ కమిన్స్‌ రాకకు టైమ్ ఫిక్స్!

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యసేవలను మంత్రులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్లు & భవనాల శాఖ (R&B), రవాణా శాఖ, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదనంగా, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, దానికి అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా బాధిత కుటుంబాలకు సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులో ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.