టిష్యూ పేపర్స్ తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బాత్ రూమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా మంది కూడా ఎప్పుడూ తమ బ్యాగ్లో పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటారు. మరి ఎన్నో రంగులు ఉండగా అసలు టిష్యూ పేపర్స్ తెలుపు రంగులోనే ఎందుకు ఉన్నాయి అనే ఆలోచన చాలా మందిలో మెదులుతుంటుంది. కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయంట.
చెట్ల నుంచి లభించే సెల్యులోజ్ ఫైబర్లను లేదా రీసైకిల్ చేసిన కాగితాన్ని ఉపయోగించి, టిష్యూ పేపర్ను తయారు చేస్తారు. అయితే వీటిని ఫైబర్లతో కలిపినప్పుడు ఒక గుజ్జు ఏర్పడుతుంది. ఇది సెల్యూలోజన్ ఫైబర్లు సహజంగా తెల్లగా ఉంటాయి. కానీ వాటిని కలిపి ఉంచే జిగురు గోధుమ రంగులో ఉంటుంది.
అయితే తయారీ సమయంలో గోధుమ రంగు తొలిగించి, కాగితాన్ని తెల్లగా మెరిసేలా చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా క్లోరిన్తో చేసి బ్లీచ్ చేస్తారంట. అంతే కాకుండా రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేసిన టిష్యూలలో తెల్లటి ఆఫీస్ కాగితాన్ని కూడా ఉపయోగిస్తారంట. అందువలన టిష్యూ పేపర్స్, చెక్కు చెదరకుండా తెల్లటి రంగులో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
అయితే రంగు రంగుల కాగితాలను టిష్యూ పేపర్గా ఉపయోగించకపోవడానికి, ఉత్పత్తి చేయకపోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయంట. ముఖ్యంగా బడ్జెట్ కారనంగా, చాలా కంపెనీలు వీటిని రంగుల్లో తయారు చేయలేదంట. అలాగే తెల్లటి రంగు పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని దీనిని ఎంచుకున్నట్లు సమాచారం. అంతే రంగులు ఉపయోగిస్తే, కెమికల్స్ కలపాల్సి వస్తుంది. ఇది చర్మ సమస్యలకు కారణం అవుతుంది కాబట్టి తెలుపు రంగులోనే ఉత్పత్తి చేయడం జరుగుతుందంట.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




