
సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, థమన్ వైపు మొగ్గు చూపిన తెలుగు నిర్మాతలు ఇప్పుడు మాత్రం కథ, బడ్జెట్తో సంబంధం లేకుండా కేవలం అనిరుధ్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. అనిరుధ్ క్రేజ్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్ను మార్చేస్తుండటంతో టాలీవుడ్ మేకర్స్ ఆయన అడిగినంత ఇవ్వడానికి వెనుకాడటం లేదు.
నిజానికి అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వడంలో బాగా లేట్ చేస్తాడని రీ-రికార్డింగ్ సమయంలోనూ సమయానికి అవుట్పుట్ ఇవ్వడని పరిశ్రమలో గట్టి టాక్ ఉంది. అయినప్పటికీ అనీకున్న విపరీతమైన క్రేజ్ కారణంగా అందరికీ అతడే కావాలి. ఈ డిమాండ్ను బేస్ చేసుకుని మన తెలుగు నిర్మాతలే అనీ రెమ్యునరేషన్ను భారీగా పెంచేశారు. ఒకప్పుడు రూ. 15 కోట్ల రూపాయలుగా ఉన్న అనిరుధ్ పారితోషికాన్ని, వరుస క్రేజీ ఆఫర్లతో ఏకంగా రూ. 25 కోట్ల రూపాయలకు పెంచేసి దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్గా నిలిపారు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో టాలీవుడ్, కోలీవుడ్కు చెందిన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలుగులో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ, అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబోలో రాబోతున్న ‘AA23’, అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాలు సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, ధర్మన్, రజనీ-కమల్ హాసన్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులకు అనిరుధ్ తన మ్యూజిక్తో థియేటర్లను షేక్ చేయబోతున్నారు.