Reading Time: < 1 minute
Cm Revanth Reddy Delhi Tour Key Talks On Rajya Sabha Candidates Amid Rising Political Heat

CM Delhi Tour: తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకు వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. రెండు ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వికు ఖరారైనట్లు సమాచారం. సింగ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Laya : అలాంటి రోల్స్ వస్తే.. నాలోని మరో కోణాన్ని చూపిస్తా..

మిగిలిన ఒక సీటు విషయంలో మాత్రం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వి. హనుమంతరావు, వేమ నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మాదిగ సమాజానికి అవకాశం ఇవ్వాలని ప్రముఖ దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుండటంతో, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!