Reading Time: < 1 minute
ఆర్టీసీ ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC

ఆర్టీసీ ప్రయాణికులు బిగ్‌ షాక్ తగిలింది.. వరుస పండగ సెలవుల నేపథ్యంలో TGRTC బస్సు చార్జీలు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. సాధారణ రోజులతో పోల్చుతే ప్రస్తుతం స్పెషల్ బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, కరీంనగర్, సత్తుపల్లికి వెళ్లే స్పెషల్ బస్సుల్లో ఈ చార్జీలు అమల్లో ఉండనున్నట్టు ఆర్టీసీ పేర్కొంది. అలాగే డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని బస్సుల్లో.. ఏసీ, ఆర్ నాన్‌ ఏసీ.. సర్వీస్‌ను బట్టి ఛార్జీలను వసూలు చేస్తోంది ఆర్టీసీ.