
BRICS 2026: న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సమావేశాల్లో ఒక ఫోటో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్రమోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కలిసి ఉన్న ఫోటో ప్రత్యేకంగా మారింది. మోడీ మధ్యలో నిలబడగా, ఇరు వైపుల పుతిన్, జిన్పింగ్ మోడీ చేతులు పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురు నేతలు సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుతున్న ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తోంది.
ఈ ఫోటో వెస్ట్రన్ దేశాలకు ఒక పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కలయికకు ప్రాధాన్యత ఏర్పడింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత, ఉక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్న వేళ ప్రపంచంలో శక్తివంతమైన దేశాధినేతలు ఒకే ఫ్రేమ్లో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రష్యా, చైనాలతో భారత్ తన సంబంధాలను బలోపేతం చేసుకుంటుండగా, మరోవైపు యూరప్, అమెరికాలతో దోస్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ సన్నివేశం ప్రత్యేకంగా మారింది.
అంతకుముందు, ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశంలో మాట్లాడుతూ.. వెస్ట్రన్ దేశాలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చారు. కొన్ని దేశాల నిర్ణయాలను గ్లోబల్ సౌత్ దేశాలు పాటించడం ఇకపై కుదరదని, ప్రపంచ నిర్ణయాల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడాలని చెప్పారు. ఉగ్రవాదాన్ని, ఏకపక్ష యుద్ధాలను ఖండిస్తూ ‘‘ఢిల్లీ డిక్లరేషన్’’కు బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలిపాయి. ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలకు దౌత్యం, చర్చలే పరిష్కారమని మరోసారి భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది.