
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.7.50 కోట్లు మంజూరు చేస్తూ సీడీఎంఏ శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని తాను కలిసి మున్సిపల్కు నిధులు ఇవ్వాలని కోరిన రెండు రోజుల్లోనే మున్సిపల్ బిల్డింగ్కు రూ.7.50 కోట్లు మంజూరు చేయడం హర్షనీయమని ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.