Reading Time: < 1 minute

త్వరలో కొత్త రోప్ను ఏర్పాటు చేస్తాం : పోతిరెడ్డిపాడు ఏఈ సుబ్రమణ్యం రెడ్డి 

Caption of Image.

శ్రీశైలం, వెలుగు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులే టర్​వద్ద తెగిపోయిన 9వ గేటును రోప్​స్థానం లో కొత్త రోప్​ను ఏర్పాటు చేస్తామని ఆ ప్రాజెక్టు ఏఈ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ వద్ద గురువారం సాయంత్రం 9వ గేటు తెరుస్తుండగా, రోప్​తెగిపోయి గేటుకు కిందకు పడిపోయింది.

విషయం తెలుసుకున్న ఏఈ శుక్రవారం ఉదయం ప్రాజెక్టును సందర్శించి డ్యామేజ్ జరిగిన గేటును పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ను నిర్మించి 16 ఏండ్లు కావస్తోందన్నారు. దీంతో గేట్ల పరిస్థిని ఎలా ఉంది? వాటికి సం బంధించిన రోప్​పటిష్టంగా ఉందా? లేదా? అని ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.