
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సమావేశాలు ముగియాల్సి ఉన్నా.. ఒక రోజు అదనంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో బుధవారం కూడా అసెంబ్లీ సమావేశం కానుంది. ఆదివారం, సోమవారం, మంగళవారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ మూడు రోజుల విరామం తర్వాత బుధవారం సభ తిరిగి ప్రారంభం కానుంది. బుధవారం ఎల్నినో అంశంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అనంతరం సభ వాయిదా పడనుంది.
మంగళవారం సీఎం రేవంత్ కీలక భేటీ
ఇదిలా ఉంటే.. ఈనెల 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 22A భూముల అంశంపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. 22A జాబితాలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణకు ఆదేశించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగే మంత్రుల సమావేశంలో 22A భూముల అంశంపై ప్రభుత్వ వైఖరిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. విచారణకు ఆదేశించాలా? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం రేవంత్రెడ్డి మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో 22A అంశంపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.