Reading Time: < 1 minute
Srks King Massive Deal Pen Marudhar Bags All India Theatrical Rights For Rs 250 Crores

కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌ను ఫ్యాన్స్ రెండేళ్లుగా మిస్ అవుతున్నాడు. జవాన్, పఠాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన డంకీ అంచనాలు అందుకోవడంలో తడబడింది. దీంతో గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు. ఈ సినిమాతో తన గారాల పట్టీ సుహానా ఖాన్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమా కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దీపికా, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ట్ కాస్ట్ పట్టుకొచ్చాడు.

Also Read : VDxShouryuv : జూనియర్ ఎన్టీఆర్ కథతో విజయ్ దేవరకొండ సినిమా

సిద్దార్థ్‌ ఆనంద్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. 2026 క్రిస్మస్ టార్గెట్ చేస్తోన్న కింగ్.. ఇంకా ఏడు నెలల టైం ఉండగానే.. థియేట్రికల్ డీల్ క్లోజ్ చేసిందట. 400కోట్లతో తెరకెక్కిస్తోన్న ఈ మూవీని 250 కోట్లు పెట్టి పెన్ మారుధర్ సంస్థ రైట్స్ కొనుగోలు చేసిందట. ఇప్పటి వరకు షారూక్‌ సినిమాల్లో ఇదే అతిపెద్ద డీల్ అని తెలుస్తోంది. అయితే ఇంత అడ్వాన్స్‌గా థియేట్రికల్ డీల్ క్లోజ్ చేయడం వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. సినిమాపై నమ్మకంతో పాటు.. ఈ ఏడాది చివరిలో అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్3, జుమాన్జీ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలు రిలీజౌతున్న నేపథ్యంలో బలమైన డిస్ట్రిబ్యూషన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ డీల్ క్లోజ్ చేసినట్లు సమాచారం.