
Praful Hinge: ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చాడు ప్రఫుల్ హింగే. అరంగేట్రంలోనే రికార్డ్ సృష్టించాడు. తొలి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అద్భుత ఫామ్లో ఉన్న వైభవ్ సూర్యవంశీ వంటి డేంజరస్ బ్యాటర్ను తొలి బంతికే ఔట్ చేయడం సంచలనం సృష్టించింది. ఇటీవల రాజస్థాన్ రాయల్స్తో జరిగిన అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అయితే.. నిన్న జరిగిన సన్రైజర్స్ హైదరాబాద్(SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్లోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో ప్రఫుల్ మొదట్లో చాలా పరుగులు ఇచ్చాడు. గత మ్యాచ్లో సంచలన బౌలింగ్ ప్రదర్శన చేసిన ప్రఫుల్ హింగేకు.. ఈ మ్యాచ్లో సంజు శామ్సన్ (7) సిక్సర్తో స్వాగతం పలికాడు. రుతురాజ్ (19; 13 బంతుల్లో 3×4) రెండు బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లో ప్రఫుల్ 15 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలా కేవలం మూడు ఓవర్లలోనే 50కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. కానీ.. చివరి ఓవర్లో మాత్రం అద్భుతం చేశాడు. చెన్నై గెలుపునకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం ఉంది. ఇక ఈ ఓవర్ను అప్పటికే అనేక పరుగులు సమర్పించుకున్న ప్రఫుల్కు ఇచ్చాడు కెప్టెన్ ఇషాన్ కిషన్. ప్రఫుల్ తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అప్పటికే మ్యాచ్ గెలిపించేందుక పోరాడుతున్న జేమీ ఓవర్టన్ను పెవిలియన్కు పంపాడు. ప్రఫుల్ వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం ఉండగా.. చెన్నై 7 పరుగులే చేసింది. దీంతో హైదరాబాద్ విజయం సాధించింది.
READ MORE: Tollywood : రిలీజయ్యాక ఆడియన్స్ను థియేటర్స్కు రప్పించేందుకు పీక్స్ ప్రమోషన్స్ చేస్తోన్న హీరోస్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. వరుసగా వికెట్లు పడటంతో సీఎస్కే కుప్పకూలింది. సంజు శామ్సన్, శివమ్ దూబే రాణించలేకపోయారు. 18 ఏళ్ల ఆయుష్ మహాత్రే (30), మాథ్యూ షార్ట్(34) మినహా ఎవ్వరూ 30 పరుగులు సైతం చేయలేకపోయారు. ఆయుష్ మహాత్రే మంచి ఇన్నింగ్స్ ఆడగా.. గాయం కారణంగా మధ్యలోనే వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. చివర్లో జేమీ ఓవర్టన్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. చివరి ఓవర్లో ప్రఫుల్ హింజ్ మరోసారి నిరూపించుకున్నాడు. లాస్ట్ ఓవర్లో ఆరు బాల్స్లో 18 రన్స్ కొట్టాల్సి ఉండగా.. బౌలర్ ప్రఫుల్ హింజ్ అద్భుతంగా కట్టడి చేశాడు. ఈషాన్ మలింగా మూడు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరోవైపు.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ఆర్ఆర్హెచ్ 194 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 15 బంతుల్లో సంచలనాత్మక అర్ధశతకం సాధించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లులతో 59 పరుగులు పూర్తి చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. ట్రావిస్ హెడ్ (23), నితీష్ కుమార్ రెడ్డి(12), సలీల్ అరోరా (13), శివాంగ్ కుమార్ (12) రన్స్ చేశారు. జేమీ ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా, ముఖేష్ చౌదరి రెండు వికెట్లు పడగొట్టాడు.