
టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రాబోయే చిత్రాల గురించి అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ అందించారు. ప్రస్తుతం చైతు ‘వృషకర్మ‘ సినిమాలో నటిస్తున్నాడు. svcc బ్యానర్ లో భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమా చైతు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోంది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటివల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Ustaad Bhagat Singh OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఉస్తాద్.. ట్రోలింగ్ తప్పేలా లేదుగా
తాజాగా ఓ ఇంటర్వూలో తన సినిమాల అప్డేట్స్ గురించి చైతన్య మాట్లాడుతూ.. “నేను ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉన్నాను. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తయింది, కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రం చాలా వినూత్నంగా ఉండబోతోంది. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తాను నటించిన ఓటీటీ డెబ్యూ ‘ధూత‘ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ‘ధూత-2‘ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందని’ తెలిపాడు. విలక్షణమైన థ్రిల్లర్ కథాంశంతో సాగే ఈ సిరీస్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు వృషకర్మ నాగచైతన్య కెరీర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివర్లో వెండితెరపై చైతన్య సందడి చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి వరుస ప్రాజెక్ట్లతో చైతన్య ఫుల్ బిజీగా గడుపుతున్నారు.