
దేశమంతా ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ ఘన విజయం సాధించగా.. కేరళలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుపొందింది. ఇక తమిళనాడు మాత్రం గందరగోళంగా మారింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా హంగ్ ఏర్పడింది. అయితే విజయ్కు చెందిన టీవీకే పార్టీ అతి పెద్ద శక్తిగా అవతరించింది. దీంతో మరోసారితో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇలాంటి తరుణంలో లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. టీవీకే విజయ్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ను అభినందించారు. అలాగే ప్రభుత్వ ఏర్పాటుపై కూడా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ తండ్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సంకేతం ఇచ్చారు. ఇలాంటి తరుణంలో రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే ఇప్పటివరకు 100కుపైగా స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 స్థానాలు ఉండాలి. అయితే చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు.