Reading Time: 2 minutes
Jabalpur Boat Accident Narmada Bargi Dam Tragedy

Jabalpur Boat Tragedy: మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో జరిగిన బోట్ ప్రమాదం దేశవ్యాప్తంగా అందరిచేత కన్నీళ్లు పెట్టించింది. 29 మంది ప్రయాణికులతో బార్గి డ్యామ్ సమీపంలో నర్మదా నదిలో క్రూయిజ్ బోట్ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మరణించారు. విపరీతమైన ఈదుదు గాలులతో ఒక్కసారిగా బోట్‌లో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ‘‘లైఫ్ జాకెట్’’ వేసుకోకపోవడం వల్ల నీటిలో మునిగి మరణించారు.

అయితే, ఈ ప్రమాదంలో ఒక తల్లి తన బిడ్డను కడ దాకా కాపాడే ప్రయత్నం చేసిన ఫోటో వైరల్ అయింది. ఆ పిల్లాడిని తన గుండెలకు హత్తుకుని మరణించింది. తల్లిబిడ్డల మృతదేహాలు ఆ విధంగా చూసిన దేశం మొత్తం కన్నీరు కార్చింది. ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నించిందనేది వెల్లడైంది. ఈ ఘటనలో తల్లి లైఫ్ జాకెట్ వేసుకున్నా ఎలా ముగినిపోయిందనేది కీలకంగా మారింది. లైఫ్ జాకెట్ ఉంది కదా, ఎందుకు నీటిలో మునిగిందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Read Also: PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం

క్రూయిజ్ బోట్ లోయర్ డెక్‌లో ఏసీ క్యాబిన్ ఉంది. ఇందులో చాలా మంది పర్యాటకులు ఉన్నారు. ఒక్కసారిగా ఈదురుగాలులు రావడం, బోటు నీటిలో వేగం కదలడంతో భయాందోళనకు గురయ్యారు. ఒక వేళ క్యాబిన్‌లో ఉంటే లైఫ్ జాకెట్ వేసుకున్నా, అందులోనుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వేగంగా నీరు క్యాబిన్‌లోకి రావడంతో లైఫ్ జాకెట్ ఉన్నా కూడా బయటకు వచ్చేందుకు సహయపడదు. నీరు వేగంగా చేరడంతో క్యాబిన్‌లో గాలి పీల్చుకునే అవకాశం కూడా ఉండదు.

భయాందోళనకు గురైన ప్రయాణికులు లైఫ్ జాకెట్లు సరిగా ధరించలేకుండా ఉండొచ్చు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే బోట్ మునిగిపోయింది. తక్కువ సమయంలో అందరూ లైఫ్ జాకెట్ వేసుకోలేకపోయారు. దీనికి తోడు బోట్ నిర్వాహకులు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు. ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని సూచించలేదు. ఇవన్నీ కలిసి 11 మంది మరణాలకు కారణమయ్యాయి. సంతోషంగా సాగాల్సిన ప్రయాణం విషాదంగా ముగిసింది. కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని మిగిల్చింది.