
భారతదేశ శత్రువు హతమయ్యాడు. లష్కరే తోయిబా సహ-వ్యవస్థాపకుడు అమీర్ హజ్జాపై కాల్పులు జరిగాయి. లాహోర్లో దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఒకసారి ఇంట్లో పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా కాల్పులు జరగడంతో హతమయ్యాడు. 2008 ముంబై దాడులతో (26/11) సహా భారతదేశంలో జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులకు ఈ సంస్థే కారణం.
అమీర్ హమ్జా..
అమీర్ హమ్జా పాకిస్థాన్కు చెందిన ఇస్లామిస్ట్. లష్కర్-ఎ-తోయిబా వ్యవస్థాపక నాయకుల్లో ఒకడు. హాఫిజ్ సయీద్ తర్వాత ఆ సంస్థకు రెండవ అత్యంత ముఖ్యమైన నాయకుడు ఇతడే. హాఫిజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. అమీర్ హమ్జాను ట్రెజరీ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ వంటి పలు దేశాలు కూడా ఉగ్రవాద సంస్థగా నిషేధించాయి.
ఈ సంస్థ పాకిస్థాన్ నిఘా సంస్థ (ISI) మద్దతుతో పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో భారత్పై భారీ దాడులకు కుట్రలు పన్నింది. సరిహద్దుల ద్వారా ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి.