
ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఏప్రిల్ 15న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్ల మధ్య హై-వోల్టేజ్ పోరు మొదలైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు.
జట్టులో కీలక మార్పు..
ఈ మ్యాచ్ కోసం ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని మ్యాచ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన పేసర్ జేకబ్ డఫీ స్థానంలో, అనుభవజ్ఞుడైన ఆస్ట్రేలియా స్పీడ్స్టర్ జోష్ హేజిల్వుడ్ తుది జట్టులోకి వచ్చారు. డఫీ వికెట్లు తీయడంలో తడబడుతుండటంతో, చిన్నస్వామి వంటి చిన్న మైదానంలో పరుగులను నియంత్రించగల సామర్థ్యం ఉన్న హేజిల్వుడ్ను తీసుకురావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. భువనేశ్వర్ కుమార్తో కలిసి హేజిల్వుడ్ కొత్త బంతితో లక్నో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
Also Read:Shocking Story: శవపేటిక దగ్గర కొట్టుకున్న ఇద్దరు ప్రియురాళ్లు.. వీడియో వైరల్
చిన్నస్వామి మైదానం అంటేనే బ్యాటర్ల అడ్డా. ఇక్కడ బౌండరీలు చాలా దగ్గరగా ఉండటం వల్ల భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. అయితే.. రాత్రి పూట మంచు (Dew) ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రెండో ఇన్నింగ్స్లో బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు కష్టమవుతుంది. అందుకే లక్ష్యాన్ని ఛేదించడం సులభమని భావించిన పాటిదార్ బౌలింగ్ వైపు మొగ్గు చూపారు.
ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. గత మ్యాచ్లలో వీరు అందించిన ఆరంభాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. మరోవైపు, రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ గత మ్యాచ్ ఓటమి నుంచి కోలుకోవాలని చూస్తోంది. ఆ జట్టులో నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రామ్ వంటి పవర్ హిట్టర్లు ఉండటంతో చిన్నస్వామిలో సిక్సర్ల వర్షం ఖాయమనిపిస్తోంది.