
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అన్నదాన సత్రం పనులను స్పీడప్ చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ నూతన అన్నదాన సత్రం పనులను ఆర్అండ్ బీ సీఈ రాజేశ్వరరెడ్డి, ఇతర అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్అండ్ బీ ఈఈ నరసింహాచారి, డీఈ శాంతయ్య, ఆలయ ఇన్చార్జి ఈవో అంజనారెడ్డి, డీఈ రఘునందన్, తహసీల్దార్ జయంత్ కుమార్ పాల్గొన్నారు.