Reading Time: < 1 minute
Pakistan Cricket Crisis Afridi Hits Out At Selectors

Shahid Afridi: ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో ఘోర పరాజయాలు మరవకముందే, పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1 తేడా పాకిస్తాన్ పరాజయాలను చవిచూసింది. దీంతో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. పాక్ మాజీ స్టార్ షాహీద్ అఫ్రిది, తన అల్లుడు అని చూడకుండా షాహీన్ అఫ్రిదిపై విమర్శలు గుప్పించారు. ఆదివారం జరిగిన మూడో వన్డేలో సల్మాన్ అలీ ఆఘా నేతృత్వంలోని పాక్ టీమ్ ఓడిపోయింది.

Read Also: India-Iran: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!

ఓటమి తర్వాత షాహీద్ అఫ్రిది ఒక వీడియోలో మాట్లాడుతూ.. బాబర్ అజమ్‌ను జట్టు నుంచి తప్పించడంతో పాటు తన అల్లుడు షహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు. పాక్ జట్టులో సర్జరీల పేరుతో నాశనం చేస్తున్నారని పీసీబీ సెలెక్టర్లపై షాహిద్ అఫ్రిది మండిపడ్డారు. “మీరు 2026 T20 ప్రపంచ కప్‌లో ప్రదర్శనలను చూశారు, ఆ తర్వాత మేము బంగ్లాదేశ్ సిరీస్‌ను కూడా 2–1తో కోల్పోయాము. నా అభిప్రాయం ప్రకారం, సెలక్షన్ కమిటీ విమర్శలకు అర్హమైనది. కమిటీలోని మీరందరూ చాలా క్రికెట్ ఆడారు, అయినప్పటికీ ఏ ఫార్మాట్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉండాలో మీకు ఇంకా ఆలోచన ఉన్నట్లు లేదు” అని అఫ్రిది అన్నారు.

‘‘ మీరు సర్జరీల పేరుతో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి సరిపోవు, అలాంటి చోట రెండు మూడు మ్యాచ్‌లు ఆడిన వారికి నేరుగా పాకిస్థాన్ క్యాప్ ఇవ్వడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. సీనియర్ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన చేయనప్పటికీ, వన్డేల్లో మంచి రికార్డులు కలిగి ఉన్నారని, అలాంటి వారిని పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.